తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 21:46

భాజపా-జేడీఎస్‌ దోస్తీ.. దేవెగౌడ కీలక వ్యాఖ్యలు..

ల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా(BJP)తో తమ పార్టీ దోస్తీ కట్టడాన్ని జేడీఎస్‌(JDS) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) సమర్థించుకున్నారు..

అవకాశవాద రాజకీయాలను చేయబోమన్నారు. ఇటీవల భాజపాతో పొత్తు, ఎన్డీయేలో చేరిక అంశంపై జేడీఎస్‌కు చెందిన కొందరు నేతలు విభేదిస్తున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన బెంగళూరులో విలేకర్ల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని.. మైనార్టీలను ఎప్పటికీ నిరాశపరచబోమన్నారు.

కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah)కు వివరించినట్టు చెప్పారు.

గత పదేళ్లలో తొలిసారి హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించానన్నారు. తమ పార్టీని కాపాడుకొనే లక్ష్యంతోనే 2014లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్నట్టు దేవెగౌడ తెలిపారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 19:46

ముగిసిన సుదీర్ఘ అంతరిక్ష యాత్ర.. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు!

నాసా (Nasa) వ్యోమగామి ఫ్రాంక్‌ రూబియో, రష్యా వ్యోమగాములు సెర్గే ప్రొకోపీవ్‌, దిమిత్రి పెటెలిన్‌లు తమ అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకొని భూమిని చేరారు..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-23 (Soyuz MS-23) స్పేస్‌ క్రాఫ్ట్‌లో బయలుదేరిన వీరు కజక్‌స్థాన్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు.

ఈ ప్రయాణం 157.4 మిలియన్‌ మైళ్లు. వాస్తవానికి ఈ మిషన్‌ ఆరు నెలల్లోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే, 2022 డిసెంబరులో రష్యన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో ఊహించని లీక్‌ చోటు చేసుకోవడంతో గడువు పొడిగించారు. దాంతో వ్యోమగాములు అంతరిక్షంలో 371 రోజులు గడపాల్సి వచ్చింది..

అంతకముందు నాసా వ్యోమగామి మార్క్ వాన్ డే హే 355 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. రూబియో సెప్టెంబరు 2022 సెప్టెంబరు 21న అంతరిక్షంలోకి వెళ్లారు. 2023 సెప్టెంబరు 11న ఆయన మార్క్‌ అంతరిక్షయాన రికార్డును బద్ధలుగొట్టారు. ఇక అంతరిక్ష కేంద్రంలో గడిపిన సమయంలో రూబియో అనేక శాస్త్రీయ పరిశోధనలకు సహకరించారు.

భవిష్యత్తులో అనేక మిషన్లను చేపట్టడానికి నాసా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పరిశోధనల సమాచారం ఎంతో విలువైనదిగా మారింది.

నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాలనే విషయం తెలిసినా రూబియో, ప్రొకోపీవ్‌, దిమిత్రిలు వెనక్కి తగ్గలేదు. సవాళ్లను ఎదుర్కొంటూనే తమ విధులు నిర్వహించారు. వారి అంకితభావం అంతరిక్షంలో మానవ జీవితంపై అవగాహనను మెరుగుపరచడమే కాకుండా.. భవిష్యత్‌ వ్యోమగాములకు ఓ మార్గదర్శకంగా నిలిచిందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 19:41

ప్రధానికి ఛాయ్‌ ఇచ్చిన రోబో.. ఫొటో మిస్‌ అవ్వొద్దన్న మోదీ

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌ (Gujarat)లో పర్యటిస్తున్నారు. 'వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌' 20వ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు..

ఈ కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ గ్యాలరీ (Robotics Gallery)ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆ గ్యాలరీలో ప్రదర్శించిన ఓ రోబో మోదీకి ఛాయ్‌ (Chai) ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ''గుజరాత్‌ సైన్స్‌ సిటీలో రోబోటిక్స్‌ గ్యాలరీ ఎంతగానో ఆకట్టుకుంది.

రోబో మాకు ఛాయ్‌ ఇచ్చిన ఫొటోను మిస్‌ అవ్వొద్దు'' అని మోదీ ఆ ఫొటోలను క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ గ్యాలరీలో అధునాతన రోబోలను ఆసక్తిగా తిలకించిన ప్రధాని.. వాటిని తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు..

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 19:37

పోలవరం బ్యాక్ వాటర్‌ విషయంలో మా అభ్యంతరాలు పట్టించుకోవట్లేదు: తెలంగాణ

హైదరాబాద్‌: పోలవరం బ్యాక్ వాటర్‌ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి (Central Water Commission) లేఖ రాసింది..

సీడబ్ల్యూసీ ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్.. పోలవరం బ్యాక్ వాటర్‌ కారణంగా రాష్ట్రంలోని 954 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇతర ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని గతంలో పలుమార్లు పేర్కొన్నట్లు తెలిపారు. 

తాము లేవనెత్తిన తొమ్మిది అంశాల్లో ఒక్కదానిపై చర్య తీసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, పీపీఏ నుంచి సమన్వయ లోపం ఉందని లేఖలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీడబ్ల్యూసీ, పీపీఏ సమావేశాల్లో ఇచ్చిన హామీలు కంటితుడుపుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు.

తక్షణమే తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 19:35

ఏపీలో రూ.50 కోట్లతో రహదారి భద్రతా నిధి..

అమరావతి: రహదారి భద్రత కోసం రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారి ప్రాజెక్టుల అంచనాలో 2 శాతం రహదారి భద్రతా నిధికి జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు..

సచివాలయంలో రహదారి భద్రతా అంశంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో జంక్షన్‌లను మెరుగుపర్చి, బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని సూచించారు. 

అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారికి సీటు బెల్టు వాడకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచనలు ఇచ్చారు.

మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలలు, కళాశాలలు, ప్రార్ధనా మందిరాల పరిసరాల్లో ప్రమాదాల నివారణకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు ప్రధాన రహదారుల వెంబడి ప్రమాదకరమైన హోర్డింగ్లు, ఫ్లెక్సీల తొలగింపునకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 19:32

టెట్ ఫలితాలలో GHMC కార్మికుడు సత్తా చాటాడు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాల ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.

టెట్ ఫలితాల్లో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హయత్ నగర్ సర్కిల్ సరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు బోడ నరేష్ పాసయ్యాడు.

బీఏ, బీఈడీ, ఎంఏ తెలుగు చదివిన నరేష్ ఉద్యోగం రాకపోవటంతో హయత్ నగర్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా టెట్‌కు ప్రిపేరై తాజా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు.

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. కాగా,

ఈ నెల 15న తెలంగాణవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్‌-1కు 2.26 లక్షలు,84.12శాతం, పేపర్‌-2కు 1.90 (91.11 శాతం, లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనుంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 15:40

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించవలసిందే: ధర్మాసనం

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో షాక్ తగిలింది. టిఎస్ పిఎస్సి అప్పీల్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 

బయోమెట్రిక్ అమలు చేయకుండా టిఎస్ పిఎస్సి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్పీ డివిజన్ బెంచ్ అప్పీల్ కు వెళ్లింది.

ఈ నేపథ్యంలో బుధవారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు నిర్ణయం సరైనదేనని, ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది . పరీక్షలో అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 15:36

చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై సుప్రీంలో విచారణ

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు..

దీన్ని సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. 

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 15:33

ఉప్పల్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సందడి

ఈరోజు నుండి మహానగరంలో వరల్డ్ కప్ సందడి మొదలైంది. విదేశీ ఆటగాళ్లు బుధవారం, గురువారం శుక్రవారం, నాడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ ప్రారంభకానుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు వార్మప్ మ్యాచ్‌లు, మూడు ప్రధాన మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం ఐదు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది.

వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పటికే న్యూజిలాండ్ టీం హైదరాబాదుకు చేరుకోగా.. ఈరోజు రాత్రి 10 గంటలకు పాకిస్థాన్ టీం శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకోనుంది.....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 15:31

ఈ నెల 29 నుంచి యువగళం పాదయాత్ర కు రెడీ అవుతున్న నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే.

ప్రస్తుతం న్యాయపరంగా చంద్రబాబు కేసులపై టీడీపీ పోరాటం చేస్తోంది. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేయగా..

బాబుకు త్వరలో ఊరట దక్కుతుందని టీడీపీ వర్గాలు యోచిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేసేందుకు ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేసిన లోకేష్.. త్వరలోనే తిరిగి అమరావతికి రానున్నారు.

ఈ నెల 29వ తేదీ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 8.15 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌పై ప్రభుత్వ వైఖరిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తలకు భరోసా కల్పించనున్నారు.

ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు పోలీసుల నుంచి అన్ని అనుమతుల వచ్చాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం, ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేయడం లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి లోకేష్ తీసుకెళ్లనున్నారు...